
క్రీడలు

దర్శకుడు, నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు నిర్మాతగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. తన ఆల్ఫా యూనిట్ బ్యానర్లో రూపొందుతున్న తొలి చిత్రం 'PRS01'ను ప్రకటిస్తూ, కొత్త దర్శకులను పరిశ్రమకు పరిచయం చేసే వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్తో కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే తన ఆలోచనను ఆయన మరోసారి చాటిచెప్పారు.
ఈ చిత్రంలో మమితా బైజు మరియు దర్శకుడు-నటుడు అశ్వత్ మారిముత్తు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంక్కర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ నటుడు శివాజీ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆసక్తికరమైన తారాగణం, కొత్త సృజనాత్మక బృందంతో తెరకెక్కుతున్న PRS01పై సినీ వర్గాల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!