

‘బిగ్బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2’ 19వ ఎపిసోడ్లో ర్యాంకింగ్స్ టాస్క్ ఆసక్తికరంగా సాగింది. 14 మంది కంటెస్టెంట్లు తమకు అర్హత ఉందని భావించిన స్థానాల్లో నిలబడాలని బిగ్బాస్ సూచించడంతో.. మొదటి నాలుగు స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో నాలుగో స్థానంలో నిలిచిన రాజకుమారికి 1 నుంచి 14 వరకు కంటెస్టెంట్ల ర్యాంకింగ్స్ను నిర్ణయించే పవర్ ఇచ్చారు. ఆమె రోహిత్ను మొదటి స్థానంలో, తనను రెండో స్థానంలో, ఝాన్సీని మూడో స్థానంలో, దీపక్ను నాలుగో స్థానంలో ఉంచింది. ఆ తర్వాత శ్రష్టి, మిథిలేష్, చరణ్, అమన్, షాలినీ, ప్రియాంక, భాగి, అపూర్వ, రామకృష్ణ, హేమంత్లకు వరుసగా స్థానాలు కేటాయించింది. ఈ ర్యాంకింగ్స్పై కంటెస్టెంట్ల మధ్య చర్చలు జరిగాయి.
అనంతరం పెయిరింగ్ కార్డు దక్కించుకున్న ప్రియాంక 14 మందిని ఏడు జంటలుగా విభజించింది. ఒక చేయి, ఒక కాలును కట్టేసి.. జంటగా సమన్వయంతో టాస్క్ పూర్తి చేయాల్సి వచ్చింది. తొలి దశలో విజయం సాధించిన జోడీల్లో ప్రియాంక-రోహిత్ ఉండగా.. రెండో దశలోనూ వీరిద్దరూ వేగంగా టాస్క్ పూర్తి చేసి విజేతలుగా నిలిచారు. అనంతరం ప్రియాంక ఓటు అప్పీల్కు వెళ్లగా.. మోస్ట్ వాల్యబుల్ ప్లేయర్గా మాత్రం జ్యూరీ రాజకుమారిని ఎంపిక చేసింది. మరోవైపు మాట మార్చడం, తన స్థానాన్ని సమర్థంగా కాపాడుకోలేకపోవడం వంటి కారణాలతో హేమంత్కు ఎల్లో కార్డు ఇచ్చారు. గెలిచిన ప్రియాంక-రోహిత్కు మరో ఎల్లో కార్డు ఇచ్చే అవకాశం లభించగా.. వారు రామకృష్ణను ఎంపిక చేశారు. తనపై తనకు నమ్మకం ఉందని, ఈ ఎల్లో కార్డు తనను ప్రభావితం చేయదని రామకృష్ణ చెప్పాడు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!