

బిగ్బాస్ తెలుగు 10లో సామాన్యులకు మరోసారి అవకాశం కల్పించాలని నిర్వాహకులు నిర్ణయించారు. గత సీజన్లలో సామాన్యులుగా వచ్చిన పల్లవి ప్రశాంత్, కళ్యాణ్ పడాల విజేతలుగా నిలవడంతో ఈ ఫార్ములాను కొనసాగించాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలో బిగ్బాస్లోకి రావాలనుకునే సామాన్యుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
ఈసారి దాదాపు 25 వేల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. వీరిలో 70 మందిని ‘అగ్నిపరీక్ష సీజన్ 2’ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. యాంకర్ శ్రీముఖి హోస్ట్గా, నవదీప్, బిందు మాధవి, అభిజిత్ న్యాయనిర్ణేతలుగా ఈ షో ఆగస్టు 15 నుంచి ప్రసారం కానుంది. టాస్క్లు, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షించి చివరికి 15 మందిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. వీరిలో ఆరుగురికి బిగ్బాస్ హౌస్లోకి వెళ్లే అవకాశం దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది.
మరోవైపు, కొందరు ఫైనల్ అభ్యర్థుల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, వీటిపై అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ లేదు. సెప్టెంబర్ తొలి వారంలో ‘అగ్నిపరీక్ష 2’ను ముగించి, సెప్టెంబర్ 6న బిగ్బాస్ తెలుగు 10ను గ్రాండ్గా ప్రారంభించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లాంచింగ్ ఎపిసోడ్లో నాగార్జున కంటెస్టెంట్ల వివరాలను ప్రకటించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!