

ఐపీఎల్లో సంచలన మార్పు చోటుచేసుకుంది. లఖ్నవూ సూపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్ రిషభ్ పంత్ మళ్లీ దిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరాడు. దిల్లీ క్యాపిటల్స్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ మధ్య కుదిరిన స్వాప్ డీల్లో భాగంగా పంత్ దిల్లీకి తిరిగి రాగా, స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లఖ్నవూ జట్టులో చేరాడు. ఈ విషయాన్ని రెండు ఫ్రాంచైజీలు తమ అధికారిక సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటించాయి.

గత రెండు సీజన్లుగా లఖ్నవూ తరఫున ఆడిన పంత్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. జట్టు ప్రదర్శన కూడా నిరాశపరిచడంతో ఇటీవల కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. 2025 ఐపీఎల్ మెగా వేలంలో రూ.27 కోట్ల భారీ ధరకు లఖ్నవూ అతడిని సొంతం చేసుకున్నప్పటికీ, బ్యాటింగ్ మరియు నాయకత్వ పరంగా ఆశించిన ఫలితాలు రాలేదు. ఇప్పుడు దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడేందుకు పంత్ తన జీతాన్ని రూ.15 కోట్లకు తగ్గించుకోగా, కుల్దీప్ యాదవ్ మాత్రం రూ.13.5 కోట్ల ప్రస్తుత ఒప్పందంతోనే లఖ్నవూకు మారాడు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!