

హిందీ సినిమాల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కంగనా రనౌత్, ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి బీజేపీ తరఫున లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆమె తాజాగా వర్షాకాల పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. నీలిరంగు చీరలో సంప్రదాయబద్ధంగా కనిపించిన కంగనా, ఖరీదైన చేతి గడియారం, హ్యాండ్బ్యాగ్తో పాటు గొడుగు పట్టుకుని పార్లమెంట్కు వచ్చారు. దీంతో ఆమె లుక్పై ఆసక్తికర చర్చ మొదలైంది.
ఆన్లైన్లో వైరల్ అవుతున్న కథనాల ప్రకారం, కంగనా ధరించిన రోలెక్స్ వాచ్ విలువ సుమారు రూ.21 లక్షలు, హ్యాండ్బ్యాగ్ ధర దాదాపు రూ.35 లక్షలు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఆమె ఉపయోగించిన గొడుగు ధర సుమారు రూ.6,100 అని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ ధరలపై చర్చ జరుగుతుండగా, కంగనా నీలిరంగు చీరలో ఎంతో అందంగా, హుందాగా కనిపిస్తున్నారంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!