
జనరల్

ఇంగ్లాండ్ , భారత్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఈరోజు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ యూకేలోని చెస్టర్-లీ-స్ట్రీట్లో రాత్రి 10 గంటలకు జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) తమ తుది జట్టును ప్రకటించింది. హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్కు విశ్రాంతి ఇవ్వడం చర్చనీయాంశమైంది.
ఇంగ్లాండ్ బ్యాటింగ్లో ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్, జాకబ్ బెతెల్, టామ్ బాంటన్ వంటి ఆటగాళ్లు ఉండగా, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్ ఆల్రౌండర్లుగా జట్టుకు బలం చేకూరుస్తున్నారు. బౌలింగ్ బాధ్యతలు సాకిబ్ మహ్మూద్, ల్యూక్ వుడ్లపై ఉన్నాయి. బలమైన జట్టుతో సిరీస్ను విజయంతో ప్రారంభించాలనే లక్ష్యంతోఇంగ్లాండ్ బరిలోకి దిగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!