

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు యశస్వి జైస్వాల్, శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ ఒకరినొకరు ఎదుర్కొనే స్థాయికి పరిస్థితి చేరుకోగా.. సహచర ఆటగాళ్లు వెంటనే జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనిపై స్పందించిన భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా.. స్లెడ్జింగ్ విషయంలో ఇరువైపులా ఒకే విధమైన నియమం ఉండాలని సూచించారు. ప్రత్యర్థి మాటలను స్వీకరించలేనప్పుడు వారిని కూడా రెచ్చగొట్టకూడదని అన్నారు.
మరోవైపు భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ ఈ ఘటనను పెద్దగా పట్టించుకోలేదు. క్రికెట్లో పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు ఇలాంటి ఉద్విగ్న పరిస్థితులు సహజమేనని ఆయన పేర్కొన్నారు. బౌలర్ కొన్ని వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి వేడెక్కిందని, అయితే జైస్వాల్ కూడా మరీ దగ్గరగా వెళ్లకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. దీంతో ఈ ఘటనపై మాజీ ఆటగాడు, కోచ్ వేర్వేరు కోణాల్లో స్పందించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!