
క్రీడలు

మలేషియాలో ఉన్న ముగ్గురు పరారీలో ఉన్న భారతీయ గ్యాంగ్స్టర్లను భారత దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకుని భారత్కు తీసుకొచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బంబీహా గ్యాంగ్తో సంబంధం ఉన్న జస్ప్రీత్ సింగ్, అజయ్ సింగ్, పవన్దీప్ సింగ్లను భారత్కు డిపోర్ట్ చేసి, అనంతరం పోలీసుల కస్టడీకి పంపినట్లు వెల్లడించారు.
ఈ ముగ్గురిపై బెదిరింపులతో డబ్బు వసూలు, సరిహద్దులు దాటి ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, లూధియానాలో విఫలమైన గ్రెనేడ్ దాడి కుట్ర వంటి పలు కేసులు ఉన్నాయని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సురక్షిత, భద్రమైన భారత్ లక్ష్యానికి అనుగుణంగా 2026లో ఇప్పటివరకు భారత ఏజెన్సీలు 51 మంది కరుడుగట్టిన నేరస్థులను భారత్కు డిపోర్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించాయని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!