
క్రీడలు

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ ఇప్పటికే 400కుపైగా పరుగులు నమోదు చేసింది. దేవదత్ పడిక్కల్ అద్భుత సెంచరీతో మెరవగా.. శుభ్మన్ గిల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్ అర్ధశతకాలతో రాణించారు. ఈ క్రమంలో రిషభ్ పంత్ తన ఖాతాలో అరుదైన రికార్డును వేసుకున్నాడు.
పంత్ 63 పరుగులతో ఆకట్టుకుని విదేశీ గడ్డపై టెస్టుల్లో 2,500కు పైగా పరుగులు చేసిన తొలి భారత వికెట్ కీపర్గా నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజ వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును అధిగమించాడు. విదేశాల్లో ధోనీ 2,496 టెస్టు పరుగులు చేయగా.. ఫరూఖ్ ఇంజినీర్, సయ్యద్ కిర్మాణి, కిరణ్ మోరే తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రెండో టెస్టులో పంత్ 21వ టెస్టు అర్ధశతకాన్ని నమోదు చేసి 63 పరుగుల వద్ద ఔటయ్యాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!