
క్రీడలు

రెండో టెస్టులో యశస్వి జైస్వాల్, శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై కొందరు యశస్వికి మద్దతుగా నిలుస్తుండగా.. మరికొందరు అతడి వ్యవహారశైలిని ప్రశ్నిస్తున్నారు. మాజీ క్రికెటర్ అజయ్ జడేజా, ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా యశస్వి మైదానంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
ఈ నేపథ్యంలో హర్షా భోగ్లే చేసిన వ్యాఖ్యలపై యశస్వి జైస్వాల్ ఘాటుగా స్పందించాడు. ప్రత్యర్థి ఏం మాట్లాడాడో తెలియకుండా ఒక అభిప్రాయానికి రావడం, సొంతంగా తీర్పులు ఇవ్వడం సరికాదని పేర్కొన్నాడు. ఎవరైనా హద్దులు దాటితే ఆ విషయాన్ని నేరుగా వారికే తెలియజేయాలని సూచించాడు. భారత జట్టు ఎప్పటికీ పోరాడుతుందని, మైదానంలో సరైన సమాధానం ఇస్తుందని యశస్వి తన స్పందనలో స్పష్టం చేశాడు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!