

భారత మహిళల క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్ల్లో ఒక్క ఓటమి కూడా లేకుండా ఆసియా కప్ను కైవసం చేసుకుంది. అయితే టోర్నీ మొత్తంలో జట్టు ఫీల్డింగ్ మాత్రం ఆందోళన కలిగించింది. భారత జట్టు ఏకంగా 13 క్యాచులను జారవిడిచింది. ఈ జాబితాలో భారత్ తర్వాత ఇండోనేషియా ఏడు క్యాచులతో ఉంది. ఈ నేపథ్యంలో భారత ఫీల్డింగ్ వైఫల్యంపై కోచ్ అమోల్ మజుందార్ స్పందిస్తూ.. ఈ విభాగంలో జట్టు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని అంగీకరించారు.
క్యాచ్లు జారవిడిచినప్పటికీ ఫీల్డింగ్ విషయంలో జట్టు మొత్తం ప్రదర్శన బాగానే ఉందని మజుందార్ తెలిపారు. అయితే ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి, గంటల తరబడి సాధన చేస్తామని చెప్పారు. మిడిలార్డర్ బ్యాటింగ్పై వస్తున్న విమర్శలను కూడా ఆయన ప్రస్తావిస్తూ.. దుబాయ్లోని పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదన్నారు. మిడిలార్డర్తో ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు. షఫాలీ వర్మ, స్మృతి మంధాన అద్భుతంగా రాణించారని ప్రశంసించారు. దాదాపు ప్రతి మ్యాచ్లో 150 పరుగుల సగటు సాధించామని పేర్కొన్న మజుందార్.. టైటిల్ గెలిచినంత మాత్రాన సంతృప్తి చెందకుండా రాబోయే టోర్నీలకు మరింత మెరుగ్గా సిద్ధమవుతామని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!