

పంజాబ్ కింగ్స్ ఆల్రౌండర్ సూర్యాంశ్ షెడ్గేకు భారత జట్టులో తొలి అవకాశం లభించింది. వచ్చే నెలలో ఐర్లాండ్, ఇంగ్లండ్ జట్లతో జరిగే టీ20 సిరీస్ల కోసం ప్రకటించిన భారత జట్టులో అతడిని ఎంపిక చేశారు. ఎడమ తొడ కండరాల గాయంతో బాధపడుతున్న నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో సూర్యాంశ్కు అవకాశం దక్కింది.
అఫ్గానిస్థాన్తో జూన్ 20న జరిగిన మూడో వన్డే తర్వాత నితీశ్ గాయపడగా, వైద్య పరీక్షల అనంతరం పునరావాసం అవసరమని బీసీసీఐ వైద్య బృందం సూచించింది. దీంతో అతడు ఐర్లాండ్, ఇంగ్లండ్లతో జరిగే టీ20 సిరీస్లకు దూరమయ్యాడు. వన్డే సిరీస్కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.
శ్రీలంకలో జరిగిన ముక్కోణపు సిరీస్లో భారత-ఎ జట్టు తరఫున సూర్యాంశ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు మ్యాచ్ల్లో 147 పరుగులు చేసి, 23 ఓవర్లు బౌలింగ్ చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 131 పరుగులను 251.92 స్ట్రైక్రేట్తో సాధించాడు. ఐపీఎల్ 2026లో 8 మ్యాచ్ల్లో 158 పరుగులు చేసి 175.56 స్ట్రైక్రేట్ నమోదు చేశాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!