

భారత ఐటీ రంగంలో మొత్తం ఉద్యోగాల నియామకాలు తగ్గుతున్నప్పటికీ, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సంబంధిత ఉద్యోగాల భర్తీ మాత్రం వేగంగా పెరుగుతోంది. నౌక్రీ జాబ్స్పీక్ నివేదిక ప్రకారం జూన్ నెలలో ఏఐ ఉద్యోగాల నియామకాలు గత ఏడాదితో పోలిస్తే 16 శాతం పెరగగా, మొత్తం ఐటీ ఉద్యోగాల నియామకాలు 3 శాతం తగ్గాయి.
1.5 లక్షలకు పైగా సంస్థల ఉద్యోగ ప్రకటనలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. సాంకేతిక రంగంలో వేగంగా జరుగుతున్న మార్పులకు అనుగుణంగా కంపెనీలు ఏఐ నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను ఎక్కువగా నియమించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
315 బిలియన్ డాలర్ల విలువైన భారత ఐటీ పరిశ్రమ ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, టెక్నాలజీ వ్యయాల తగ్గుదల వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇదే సమయంలో ఏఐ ప్రభావంతో సంప్రదాయ వ్యాపార విధానాలు మారుతుండటంతో కంపెనీలు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఏఐ ప్రతిభపై మరింత పెట్టుబడి పెడుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!