
జనరల్

ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి ఉద్యోగాల కోతలను నిశ్శబ్దంగా ప్రారంభించింది. గూగుల్ క్లౌడ్తో పాటు కీలకమైన సైబర్ సెక్యూరిటీ విభాగాలు కూడా ఈ లేఆఫ్స్ ప్రభావానికి లోనయ్యాయి. ముఖ్యంగా థ్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్, మాండియంట్ వంటి ప్రతిష్టాత్మక బృందాల ఉద్యోగులు ప్రభావితమయ్యారని సమాచారం.
2022లో 5.4 బిలియన్ డాలర్లతో మాండియంట్ను కొనుగోలు చేసిన గూగుల్, ఇప్పుడు ఆ విభాగంలో కూడా కోతలు విధించడం ఆందోళన కలిగిస్తోంది. కంపెనీ అధికారికంగా సంఖ్య వెల్లడించకపోయినా, కృత్రిమ మేధ రంగానికి పెరుగుతున్న డిమాండ్ కారణంగా వనరులను ఆ దిశగా మళ్లిస్తున్నట్లు సమాచారం. దీంతో గూగుల్ వ్యూహాత్మక మార్పుల దిశగా అడుగులు వేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!