

మెటా సంస్థ వాట్సప్ వినియోగదారుల కోసం ‘వాట్సప్ ప్లస్’ అనే కొత్త పెయిడ్ సబ్స్క్రిప్షన్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవకు నెలకు రూ.79 చెల్లించాల్సి ఉంటుంది. అయితే మొదటి 30 రోజులు ఉచిత ట్రయల్ సౌకర్యం కూడా అందిస్తోంది. వాట్సప్ సెట్టింగ్స్లోకి వెళ్లి సబ్స్క్రిప్షన్స్ విభాగంలో ‘వాట్సప్ ప్లస్’ ఎంపిక చేసుకోవడం ద్వారా ఈ సేవను యాక్టివేట్ చేయవచ్చు.
ఈ ప్రీమియం సర్వీస్లో అనేక కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా 3 చాట్స్ మాత్రమే పిన్ చేసుకునే అవకాశం ఉండగా, ఇందులో 20 చాట్స్ వరకు పిన్ చేయవచ్చు. అలాగే వాట్సప్ లోగో రంగు, చాట్ థీమ్లు, మెసేజ్ బబుల్స్, వాల్పేపర్స్, నోటిఫికేషన్, రింగ్టోన్లను పూర్తిగా కస్టమైజ్ చేసుకోవచ్చు. రాయల్ పర్పుల్, వెల్వెట్ రెడ్, సైబర్ పంక్ బ్లూ వంటి ప్రీమియం థీమ్లు కూడా అందుబాటులో ఉంటాయి. అవసరమైతే ఎప్పుడైనా సబ్స్క్రిప్షన్ను రద్దు చేసుకోవచ్చు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!