

ఏఐ ఆధారిత నోట్ టేకింగ్ ఎకోసిస్టమ్కు పేరుగాంచిన ప్లాడ్ సంస్థ తొలిసారిగా భారత్లో తన ఉత్పత్తులను విడుదల చేసింది. సంస్థ ఫ్లాగ్షిప్ ప్లాడ్ నోట్ ప్రో, వేరబుల్ ప్లాడ్ నోట్పిన్ ఎస్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ డివైజ్లు సమావేశాలు, సంభాషణలను రికార్డ్ చేసి వాటిని ఆటోమేటిక్గా ట్రాన్స్క్రిప్ట్లు, సారాంశాలు, సెర్చ్ చేయగల కంటెంట్గా మార్చగలవు.
భారత్లో ప్లాడ్ నోట్ ప్రో ధర రూ.20,990, నోట్పిన్ ఎస్ ధర రూ.19,990గా ఉంది. నోట్పిన్ ఎస్ 64జీబీ స్టోరేజ్తో బ్లాక్, సిల్వర్, పర్పుల్ రంగుల్లో లభిస్తుంది. నోట్ ప్రో బ్లాక్, సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంది. రెండు డివైజ్లను అమెజాన్, బ్లింకిట్, ప్లాడ్ అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇవి తెలుగు, హిందీ, తమిళం సహా 112కుపైగా భాషలకు మద్దతు ఇస్తాయి.
నోట్ ప్రో క్రెడిట్ కార్డు పరిమాణంలో 2.99 మిల్లీమీటర్ల మందంతో, 30 గ్రాముల బరువుతో ఉంటుంది. ఇందులో కలర్ డిస్ప్లే, నాలుగు మైక్రోఫోన్లు, నాయిస్ ఫిల్టరింగ్, 500mAh బ్యాటరీ, బ్లూటూత్, వై-ఫై కనెక్టివిటీ ఉన్నాయి. నోట్పిన్ ఎస్ను నెక్లెస్, క్లిప్, రిస్ట్బ్యాండ్ లేదా పిన్గా ధరించవచ్చు. ఇది 17.4 గ్రాముల బరువు, 320mAh బ్యాటరీతో వస్తుంది. రెండు డివైజ్ల రికార్డింగ్లను వెబ్, డెస్క్టాప్, మొబైల్ యాప్ల ద్వారా యాక్సెస్ చేయవచ్చు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!