
సినిమాలు

హిమాచల్ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండ ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. భర్మౌర్లోని కొడ్లా-ఉరై-ఘటోర్ రహదారిపై భారీగా కొండచరియలు విరిగిపడి రహదారి పూర్తిగా దెబ్బతింది. దీంతో మట్టి, రాళ్లు రోడ్డుపైకి కొట్టుకురావడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
భారీ వర్షాల ప్రభావంతో కొండ ప్రాంతాల్లో ప్రమాదం మరింత పెరిగింది. రహదారులపై మట్టి, రాళ్లు పేరుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!