

ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ భారత్లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించే ప్రక్రియలో ఉన్నప్పటికీ, తుది అనుమతులపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. భద్రతాపరమైన అంశాలపై మరింత సమీక్ష అవసరమని భావిస్తూ తుది క్లియరెన్స్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. అయితే ప్రభుత్వంతో చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని స్టార్లింక్ స్పష్టం చేసింది.
స్టార్లింక్ బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ మాట్లాడుతూ, సంస్థ అన్ని నియంత్రణ నిబంధనలను పాటిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తోందని తెలిపారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇరాన్కు సంబంధించిన భద్రతా ఆందోళనల నేపథ్యంలో అధికారులు మరింత స్పష్టత కోరుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్టార్లింక్ 6,000కు పైగా లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా హైస్పీడ్, తక్కువ లేటెన్సీ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!