

కృత్రిమ మేధస్సు (ఏఐ) వ్యవస్థలు వ్యాసాలు రాయడం, ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, సంక్లిష్ట సమస్యలను పరిష్కరించడం వంటి అనేక రంగాల్లో అద్భుత సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ, ఏకాగ్రత మరియు స్వీయ నియంత్రణ విషయంలో ఇంకా మానవ మెదడుకు సాటిరావడం లేదని తాజా అధ్యయనం వెల్లడించింది. న్యూయార్క్ సిటీ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన స్ట్రూప్ టెస్ట్ ద్వారా చాట్జీపీటీ, క్లాడ్, జెమినై వంటి ప్రముఖ ఏఐ నమూనాల పనితీరును పరిశీలించారు.
చిన్న జాబితాల్లో ఏఐ నమూనాలు మెరుగైన కచ్చితత్వాన్ని ప్రదర్శించినప్పటికీ, పదాల సంఖ్య పెరిగేకొద్దీ వాటి పనితీరు గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. సంబంధం లేని సమాచారాన్ని పక్కనపెట్టి నిర్దిష్ట లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించడంలో ఏఐ ఇబ్బంది పడుతున్నట్లు తేలింది. మరోవైపు, మనుషులు గందరగోళ పరిస్థితుల్లో కూడా ఏకాగ్రతను నిలుపుకుంటూ మెరుగైన ఫలితాలను సాధించగలరని అధ్యయనం స్పష్టం చేసింది. దీంతో భాషా సామర్థ్యం, తార్కిక విశ్లేషణలో ఏఐ ముందంజలో ఉన్నప్పటికీ, దృష్టి నియంత్రణలో మానవ మెదడు ఇంకా ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!