

అదానీ గ్రూప్ ఒడిశాలో రూ.80,000 కోట్ల భారీ పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించినట్లు సమాచారం. ఇందులో ఆధునిక అల్యూమినియం కాంప్లెక్స్ ఏర్పాటు, 3,000 మెగావాట్ల సామర్థ్యంతో రెండు అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణం, రూ.80,000 కోట్ల విలువైన బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ వంటి కీలక ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర పారిశ్రామిక రంగానికి మరింత ఊతమివ్వడంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి దోహదపడే అవకాశం ఉంది.
భారీ పెట్టుబడులతో ఒడిశాలో పారిశ్రామిక కార్యకలాపాలు వేగం పుంజుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కొత్త ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు తయారీ, ఇంధనం, మౌలిక వసతుల రంగాల్లో వృద్ధికి మార్గం సుగమం కావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ పెట్టుబడి ప్రణాళికను భారత పారిశ్రామిక అభివృద్ధిలో కీలక ముందడుగుగా పరిశ్రమ వర్గాలు అభివర్ణిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!