

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 10 గంటల సమయానికి నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 23,219 వద్దకు చేరగా, సెన్సెక్స్ 322 పాయింట్లు లాభపడి 74,326 వద్ద ట్రేడైంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం కోసం మదుపరులు ఎదురుచూస్తుండటంతో మార్కెట్లలో అప్రమత్తత కొనసాగుతోంది. నిఫ్టీ 50లో నెస్లే ఇండియా, ఐటీసీ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముందంజలో ఉన్నాయి.
విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్క్యాప్ 0.25 శాతం, నిఫ్టీ స్మాల్క్యాప్ 0.56 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఒక శాతానికి పైగా లాభపడగా, నిఫ్టీ ఫార్మా అత్యధికంగా క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికా డాలర్ సూచీ 99.34 వద్ద, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 108.41 డాలర్ల వద్ద ఉన్నాయి. అమెరికా పదేళ్ల బాండ్ ఈల్డ్ 5 శాతానికి చేరగా, గత సెషన్లో ఎస్అండ్పీ 0.4 శాతం, నాస్డాక్ 0.8 శాతం నష్టపోయాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!