
జనరల్

భారత్ డిజిటల్ చెల్లింపుల రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. అధికారిక గణాంకాల ప్రకారం, యూపీఐ ద్వారా 24,162 కోట్లకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి. వీటి మొత్తం విలువ రూ.314 లక్షల కోట్లకు మించి ఉంది. ఇది దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం ఎంత వేగంగా పెరుగుతోందో చూపిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా జరిగే డిజిటల్ చెల్లింపుల్లో దాదాపు సగం వాటా యూపీఐదే కావడం విశేషం. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్తరణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో పెరిగిన అవగాహన ఈ విజయానికి ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో యూపీఐ కీలక పాత్ర పోషిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!