
సినిమాలు

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర 4.3 శాతం పడిపోయి బ్యారెల్కు 92 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్, ఎఫ్ఎమ్సీజీ రంగాల్లో కొనుగోళ్లు పెరగడం, డాలర్తో పోలిస్తే రూపాయి 96.24 వద్ద బలపడడంతో భారత స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.
గత సెషన్లో 76,059 వద్ద ముగిసిన సెన్సెక్స్ నేడు దాదాపు 600 పాయింట్ల లాభంతో ప్రారంభమై, ఉదయం 9:40 గంటలకు 627 పాయింట్లు ఎగిసి 76,687 వద్ద ట్రేడైంది. నిఫ్టీ కూడా 176 పాయింట్ల లాభంతో 23,943 వద్ద కొనసాగింది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఒరాకిల్ ఫిన్సెర్వ్, కేఫిన్ టెక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్, లారస్ ల్యాబ్స్ షేర్లు లాభపడగా, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, మోతీలాల్ ఓస్వాల్, పేటీఎమ్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!