31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ దూకుడు - ఆనంద్‌ మహీంద్రా

Writer: Nithish 07:03 AM, 31 జులై, 2026
ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ దూకుడు - ఆనంద్‌ మహీంద్రా

ప్రపంచ ఉత్పాదకత రంగంలో భారత్‌ పాత్ర రోజురోజుకూ పెరుగుతోందని మహీంద్రా గ్రూపు ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సరఫరా వ్యవస్థల్లో మార్పుల దిశగా కదులుతోందని, తయారీ విస్తరణ కోసం దేశాలు స్థిరత్వం, ఉత్పాదక సామర్థ్యం, ప్రతిభ, విశ్వసనీయ భాగస్వాములను కోరుకుంటున్నాయని అన్నారు. ఈ అన్ని అంశాలను అందించే నమ్మకమైన పరిష్కారంగా భారత్‌ ఎదుగుతోందని ఎంఅండ్‌ఎం 80వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పేర్కొన్నారు. గత దశాబ్దంలో మహీంద్రా సంస్థకు లభించిన పేటెంట్ల సంఖ్య 56 నుంచి 1,300కు పైగా పెరిగిందని తెలిపారు. నాగ్‌పుర్‌లో రూ.15,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించినట్లు వెల్లడించారు.

మహీంద్రా అండ్‌ మహీంద్రా జూన్‌ త్రైమాసికంలో అద్భుత ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ నికర లాభం రూ.5,455 కోట్లకు చేరి, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 34 శాతం వృద్ధి సాధించింది. ఆదాయం రూ.45,529 కోట్ల నుంచి రూ.58,188 కోట్లకు పెరిగింది. వాహన, వ్యవసాయ విభాగాలు మెరుగైన పనితీరు కనబరిచాయని కంపెనీ తెలిపింది. మొత్తం వాహన విక్రయాలు 23 శాతం పెరిగి 3.04 లక్షలకు చేరుకోగా, ఎస్‌యూవీ విక్రయాలు 1.75 లక్షల మైలురాయిని అధిగమించాయి. టెక్‌ మహీంద్రా, మహీంద్రా లాజిస్టిక్స్‌, ఆర్థిక సేవల విభాగాల్లోనూ వృద్ధి నమోదైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోదీ పిలుపు ఎఫెక్ట్.. బంగారం డిమాండ్‌లో భారీ తగ్గుదల

మోదీ పిలుపు ఎఫెక్ట్.. బంగారం డిమాండ్‌లో భారీ తగ్గుదల

టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మైక్రోసాఫ్ట్ కొత్త అడుగు

టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మైక్రోసాఫ్ట్ కొత్త అడుగు

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

సీఎస్‌ఆర్ ప్రయాణంలో కీలక మలుపు

సీఎస్‌ఆర్ ప్రయాణంలో కీలక మలుపు

బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను

బ్రిటన్ పోర్టులపై అదానీ కన్ను

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్

యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్

ట్యాగ్లు
ఆనంద్‌ మహీంద్రామహీంద్రా గ్రూప్తయారీ రంగంభారత ఆర్థిక వ్యవస్థమేక్‌ ఇన్‌ ఇండియావ్యాపార వృద్ధిఆటోమొబైల్ రంగంమహీంద్రా ఎస్‌యూవీకార్పొరేట్ వార్తలుపెట్టుబడులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కామన్వెల్త్‌లో భారత్‌ పతకాల వేట.. లవ్‌ప్రీత్‌కు రజతం, సీమకు కాంస్యం
క్రీడలు

కామన్వెల్త్‌లో భారత్‌ పతకాల వేట.. లవ్‌ప్రీత్‌కు రజతం, సీమకు కాంస్యం

మోదీపై నటుడు సుదేశ్ బెర్రీ ప్రశంసలు
సినిమాలు

మోదీపై నటుడు సుదేశ్ బెర్రీ ప్రశంసలు

అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

అమరావతి భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

స్మార్ట్‌వాచ్‌ అలర్ట్‌తో వ్యక్తికి సకాలంలో వైద్యం
టెక్నాలజీ

స్మార్ట్‌వాచ్‌ అలర్ట్‌తో వ్యక్తికి సకాలంలో వైద్యం

ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ దూకుడు - ఆనంద్‌ మహీంద్రా
బిజినెస్

ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ దూకుడు - ఆనంద్‌ మహీంద్రా

స్పేస్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌కు మరో విజయం
టెక్నాలజీ

స్పేస్‌ టెక్నాలజీలో హైదరాబాద్‌కు మరో విజయం

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా
జనరల్

ఆస్తి పత్రాలు పోగొట్టిన ఎస్బీఐకు జరిమానా

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌
జనరల్

ట్రైనీ ఐపీఎస్‌ కేసులో మిస్సింగ్‌ ఫోన్‌ ట్విస్ట్‌

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు
జనరల్

పెల్లెట్ గన్ల వినియోగంపై సుప్రీం కీలక తీర్పు

పెద్దన్న మృతిపై హరీశ్ రావు సంతాపం
రాజకీయాలు

పెద్దన్న మృతిపై హరీశ్ రావు సంతాపం

దేశంలో తొలి ట్రై హైబ్రిడ్ స్కూటర్‌ ఆవిష్కరణ
టెక్నాలజీ

దేశంలో తొలి ట్రై హైబ్రిడ్ స్కూటర్‌ ఆవిష్కరణ

పెద్ది మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
రాజకీయాలు

పెద్ది మృతిపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!