
జనరల్

హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. బీఎస్ఈలో నిన్న ట్రేడింగ్ ప్రారంభంలో కంపెనీ షేరు ధర ఏడాది గరిష్ఠ స్థాయి రూ.1,858.95ను తాకడంతో సంస్థ మార్కెట్ విలువ తొలిసారిగా రూ.1 లక్ష కోట్ల మైలురాయిని చేరుకుంది.
ట్రేడింగ్ ముగిసే సమయానికి షేరు 0.39 శాతం లాభంతో రూ.1,842.70 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.99,551.79 కోట్లుగా నమోదైంది. హైదరాబాద్లో లిస్టెడ్ ఫార్మా కంపెనీల్లో లారస్ ల్యాబ్స్ రెండో అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. రూ.2.21 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాప్తో దివీస్ ల్యాబొరేటరీస్ తొలి స్థానంలో కొనసాగుతోంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!