

స్విట్జర్లాండ్లో అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు సానుకూలంగా ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ నెల 19న విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.4,859 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం పెట్టుబడిదారుల ఉత్సాహాన్ని పెంచింది.
ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 94.25 వద్ద బలపడడం కూడా మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. గత సెషన్లో 76,802 వద్ద ముగిసిన సెన్సెక్స్ ఈరోజు ఉదయం దాదాపు 360 పాయింట్ల లాభంతో ప్రారంభమై తన జోరును కొనసాగించింది.
ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 405 పాయింట్లు లాభపడి 77,208 వద్ద కొనసాగగా, నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి 24,135 వద్ద ట్రేడైంది. బ్యాంక్ నిఫ్టీ 157 పాయింట్లు, నిఫ్టీ మధ్య తరహా సూచీ 261 పాయింట్లు లాభపడ్డాయి. వోల్టాస్, పీబీ ఫిన్టెక్, అంబర్ ఎంటర్ప్రైజెస్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, సిప్లా షేర్లు లాభాల్లో ఉండగా, కమిన్స్, మదర్సన్, వరుణ్ బేవరేజెస్, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ షేర్లు నష్టాల్లో కొనసాగాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!