
జనరల్

ఇరాన్తో కొనసాగుతున్న సైనిక ఘర్షణ ముగిసిన వెంటనే చమురు ధరలు భారీగా పడిపోతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రస్తుతం అమెరికాలోని ఇతర ఉత్పత్తుల ధరలతో పోలిస్తే చమురు ధరల పరిస్థితి భిన్నంగా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ వివాదం కారణంగానే క్రూడ్ ధరలపై ఒత్తిడి కొనసాగుతోందని తెలిపారు.
తన సామాజిక మాధ్యమ వేదిక ‘ట్రూత్ సోషల్’లో చేసిన పోస్టులో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో సైనిక ఘర్షణ ముగిసిన వెంటనే చమురు ధరలు ‘రాయి లాగా కిందకు పడిపోతాయి’ అని పేర్కొన్నారు. ఇరాన్ వివాదం అంతర్జాతీయ క్రూడ్ ధరలు, ఇంధన మార్కెట్లపై చూపుతున్న ప్రభావం నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!