

తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈఓ మెండు లోకనాథం నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో నెల్లూరు ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొంది తనిఖీలు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన లోకనాథం ప్రస్తుతం డిప్యూటీ ఈఓగా విధులు నిర్వహిస్తున్నారని, ఆయన ఆస్తులపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.
తిరుపతిలో లోకనాథం నివాసంతో పాటు ఆయన బంధువులు, తమ్ముడి ఇళ్లను కలిపి మొత్తం ఐదు ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. సోదాల్లో లభించిన బంగారం, ఆస్తి పత్రాలు, ఇతర కీలక పత్రాలను అధికారులు పరిశీలించి ధ్రువీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు 1064 టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ సూచించారు. ఏసీబీ అధికారులమని చెప్పి డబ్బులు వసూలు చేసే నకిలీ వ్యక్తులను నమ్మవద్దని, అలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే ఏసీబీ టోల్ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలని కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!