

న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్లో సోమవారం జరిగిన కత్తుల దాడిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి (32) మృతి చెందారు. క్వీన్స్కు చెందిన 49 ఏళ్ల మహిళ రెండు కత్తులతో అక్కడికి వచ్చి ఇద్దరిపై దాడి చేసింది. ముందుగా 68 ఏళ్ల వ్యక్తిపై దాడి చేసిన నిందితురాలు, కొద్దిసేపటికే ఎరిన్పై కూడా కత్తితో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఎరిన్ను ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. మరో బాధితుడు చికిత్స పొందుతున్నారు.
దాడి అనంతరం పోలీసులు నిందితురాలిని కత్తులు కిందపెట్టాలని పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆమె స్పందించకుండా పోలీసుల వైపు దూసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా ఆమె మృతి చెందింది. ఎరిన్ పియాసెంటి ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వపు సెలవు అనంతరం విధుల్లోకి తిరిగి వచ్చినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఆమె మృతిపై బ్యాంక్ ఆఫ్ అమెరికా తీవ్ర విచారం వ్యక్తం చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!