
జనరల్

ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య విస్తరణకు మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్రానికి అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేస్తూ జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కడప ప్రభుత్వ వైద్య కళాశాలకు 75 అదనపు ఎంబీబీఎస్ సీట్లు, నెల్లూరులోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు 25 ఎంబీబీఎస్ సీట్లను ఆమోదించింది.
ఈ నిర్ణయం రాష్ట్రంలో వైద్య విద్యను మరింత బలోపేతం చేయడంలో కీలకంగా నిలుస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్ల పెంపుతో మరింత మంది విద్యార్థులకు వైద్య విద్యాభ్యాసానికి అవకాశం లభిస్తుందని, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!