

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక ప్రకటన చేశారు. తిరుపతిలో తన విద్యా సేవలను మరింత విస్తరిస్తూ డీమ్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందని, గత ఏడాది తన జన్మదినం సందర్భంగా శ్రీవారిని కోరుకున్న సంకల్పం ఇప్పుడు నెరవేరిందని తెలిపారు.
గత 35 ఏళ్లుగా విద్యారంగంలో సేవలందిస్తున్నానని, స్కూళ్లు, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు, యూనివర్సిటీల ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్య అందించామని మల్లారెడ్డి చెప్పారు. రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని పాత విద్యాసంస్థ భవనాలను ఆధునికీకరించి కొత్త యూనివర్సిటీని ప్రారంభిస్తామని వెల్లడించారు. రాయలసీమతో పాటు దేశవ్యాప్తంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో నైపుణ్యాలు పెంపొందించే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తుందని ఆయన తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!