

ఎయిరిండియాకు చెందిన పుకెట్-ఢిల్లీ విమానం ల్యాండింగ్కు కొద్దిసేపటి ముందు తీవ్ర గాలుల కారణంగా భారీ కుదుపులకు గురైంది. ఎయిర్లైన్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విమానం గాల్లో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా సుమారు 300 అడుగుల మేర కిందకు పడిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది గాయపడ్డారు. అయితే పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
విమానం ఢిల్లీలో దిగగానే ముందుగానే సిద్ధంగా ఉన్న వైద్య బృందాలు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాయి. గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందిస్తున్నామని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఎయిరిండియా వెల్లడించింది. ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దర్యాప్తు ప్రారంభించగా, విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు ఎయిర్లైన్స్ తెలిపింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!