
గాసిప్స్

శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్పై మహారాష్ట్రలోని నాందేడ్లో గురుద్వారా సందర్శన సమయంలో దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి ఆయనను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో బాదల్ చేతికి గాయమవడంతో పాటు ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరికి కూడా గాయాలయ్యాయి.
దాడి అనంతరం సుఖ్బీర్ సింగ్ బాదల్ను నాందేడ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరనేది, ఘటనకు గల కారణాలేమిటనేది తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!