

తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ ప్రస్తావన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల అసెంబ్లీలో అన్నాదురై, ఎంజీఆర్, ఎన్టీఆర్ పేర్లను ప్రస్తావిస్తూ తొలి ఎన్నికల్లోనే అధికారాన్ని అందుకున్న నేతల సరసన తనను తాను నిలబెట్టుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే ఈ ముగ్గురు నేతలతో పోలిస్తే విజయ్ ఎదుర్కొనే రాజకీయ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా మిత్రపక్షాలను కలుపుకుని ముందుకు సాగడం ఆయనకు పెద్ద సవాల్గా మారనుంది.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను సమతుల్యం చేయడం విజయ్ ప్రభుత్వానికి కీలకం కానుంది. మారుతున్న డిజిటల్ రాజకీయాలు, సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని కూడా ఆయన సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. తొలి ఎన్నికల్లో విజయం సాధించడం ఒక ఎత్తయితే ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించడం మరో ఎత్తు. అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్ల మాదిరిగా రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేయడమే విజయ్ ముందున్న అసలు పరీక్షగా మారనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!