

కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. జూన్ 28 లేదా జూన్ 29న కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తేదీలపై చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. పలువురు సీనియర్ మంత్రుల శాఖల్లో మార్పులు జరిగే అవకాశముండగా, యువత ఆశయాలకు అనుగుణంగా కొత్త ముఖాలకు కేబినెట్లో చోటు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
మాజీ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్కు కేంద్ర కేబినెట్లో అవకాశం దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. అలాగే నిర్మలా సీతారామన్కు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్ సింగ్ పురి, మనోహర్ లాల్ ఖట్టర్ తదితరుల శాఖల్లో మార్పులు ఉండవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అనురాగ్ ఠాకూర్ తిరిగి కేబినెట్లో చోటు దక్కించుకోవచ్చని, శ్రికాంత్ షిండే, అరుణ్ గోవిల్, విష్ణుదత్ శర్మ, జనార్ధన్ సింగ్ సిగ్రీవాల్, తరుణ్ చుగ్ వంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ మార్పులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!