
రాజకీయాలు

సాయి కృష్ణ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం మరో కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. కానిస్టేబుళ్లు బాబురావు, సాంబయ్యలను అదుపులోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరింది. ఇప్పటికే కానిస్టేబుళ్లు అశోక్, నానిల కస్టడీ కోసం కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం పిటిషన్లు దాఖలు చేసింది.
ఈ కేసులో దాఖలైన ప్రైవేట్ పిటిషన్పై విచారణను రెండో అదనపు జిల్లా న్యాయస్థానం వాయిదా వేసింది. డీజీపీ, పోలీస్ కమిషనర్, ఏసీపీలను నిందితులుగా చేర్చాలని కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. తదుపరి విచారణను కోర్టు నేటికి వాయిదా వేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!