

నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో సీబీఐ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలుస్తోంది. ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, నటుడు డినో మోరియా, రియా చక్రవర్తి, మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ పేర్లు ఉన్నట్లు సమాచారం. దీంతో దిశా మృతి కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
దిశా సాలియన్ 2020 జూన్ 8న ముంబైలో మృతి చెందారు. తొలుత ఆమె మృతిని ముంబై పోలీసులు ఆత్మహత్యగా భావించారు. దిశా మృతి జరిగిన వారం రోజులకే సుశాంత్ సింగ్ రాజ్పుత్ కూడా ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసుపై ఆసక్తి మరింత పెరిగింది. దిశాపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. అయితే ఇవి ఆరోపణలు మాత్రమేనని, దర్యాప్తులో వాస్తవాలు తేలాల్సి ఉందని పేర్కొనాలి. దిశా మృతిపై తాజాగా తలెత్తిన అనుమానాల నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!