
సినిమాలు

ఫుకెట్-ఢిల్లీ విమాన ఘటనపై దర్యాప్తు మరింత విస్తరించింది. ఈ కేసులో ఎయిర్ ఇండియా ముఖ్య కార్యనిర్వహణ అధికారి క్యాంప్బెల్ విల్సన్కు పౌర విమానయాన శాఖ సమన్లు జారీ చేసింది. సమన్ల నేపథ్యంలో విల్సన్ విమానయాన శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై, దర్యాప్తు పురోగతిపై తాజా వివరాలను వెల్లడించారు. విమానంలో చోటుచేసుకున్న పరిణామాలపై అధికారులు మరింత లోతుగా వివరాలను సేకరిస్తున్నారు.
విమానంలో అసలు ఏం జరిగిందనే అంశంతో పాటు భద్రత, కార్యకలాపాల నిర్వహణకు సంబంధించిన అంశాలపైనా విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగిస్తోంది. ఈ దర్యాప్తులో ఎయిర్బస్, ఫ్రాన్స్కు చెందిన పౌర విమానయాన భద్రతా దర్యాప్తు, విశ్లేషణ సంస్థ నిపుణులు కూడా పాల్గొంటున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!