

భువనగిరి లోక్సభ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పేపర్ లీకుల అంశంపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 67 వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఎలాంటి అవకతవకలు లేకుండా భర్తీ చేసిందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్పష్టమైన దూరదృష్టి ఉందని పేర్కొన్నారు.
నీట్ పేపర్ లీక్ అంశాన్ని ప్రస్తావించిన చామల, విద్యార్థుల నిరసనల తర్వాతే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో గ్రూప్-1, పదో తరగతి పరీక్షల పేపర్లు లీక్ అయినప్పుడు బీజేపీ నాయకులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. పార్లమెంట్లో నీట్ పేపర్ లీక్పై చర్చ జరగాలన్న రాహుల్ గాంధీ డిమాండ్కు మద్దతు ప్రకటిస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!