
జనరల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. అమరావతిలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్న మంత్రులకు ఆయన కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలు గ్రామస్థాయి వరకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రెండు వారాల పాటు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. ప్రభుత్వం గురించి కాకుండా ప్రజలు పథకాల ప్రయోజనాల గురించి మాట్లాడుకునేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్ని చెప్పామని, ఇకపై మరింత వేగంగా ముందుకు సాగాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!