

అమరావతిలో విశాఖ ఎకనామిక్ రీజియన్ (వీఈఆర్) అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వివిధ రంగాల్లో కీలక ప్రాజెక్టుల ద్వారా రూ.9.50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో రూ.3.50 నుంచి 4 లక్షల కోట్ల వరకు ప్రభుత్వ పెట్టుబడులు, రూ.5.30 లక్షల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు సమీకరించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. బే సిటీ (BeCity) ప్రాజెక్ట్ను యాంకర్ ప్రాజెక్ట్గా తీసుకుని విశాఖ ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.
వీఈఆర్ పరిధిలోని ప్రతి ప్రాంతం, ప్రతి రంగాన్ని పరిగణనలోకి తీసుకుని సూక్ష్మ స్థాయి ప్రణాళికతో అభివృద్ధి చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఏఐ డేటా సెంటర్ల ఎకోసిస్టమ్, పోర్టు ఆధారిత పరిశ్రమలు, పర్యాటకం, హైడ్రోజన్, క్లీన్-టెక్ ఎనర్జీ వంటి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అలాగే మూలపేట పోర్టు నుంచి రాజమహేంద్రవరం అఖండ గోదావరి ప్రాజెక్టు వరకు వివిధ ప్రాజెక్టులను అనుసంధానిస్తూ అభివృద్ధి చేపట్టాలని, నిధుల కన్వర్జెన్స్తో పాటు అవసరమైన చోట వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) పథకాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో పాటు ఆర్థిక, పరిశ్రమలు, పురపాలక, అటవీ, ఇంధన, పర్యాటక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!