
క్రీడలు

పాకిస్తాన్లో సైనిక కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. థాల్ కంటోన్మెంట్కు వెళ్తున్న సైనిక కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎనిమిది మంది పాక్ సైనికులు మృతి చెందారు. ఘటనాస్థలంలోనే ఆర్మీ లెఫ్టినెంట్ సిరాజ్ బాబర్ మృతి చెందినట్లు సమాచారం. దాడి అనంతరం భద్రతా దళాలు అప్రమత్తమై ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపాయి.
కాన్వాయ్పై దాడి జరిగిన ప్రాంతంలో భద్రతా దళాలు గాలింపు, కూంబింగ్ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అయితే ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థ, దాడి వెనుక కారణాలు, ఎదురుకాల్పుల్లో జరిగిన నష్టం వంటి వివరాలపై పూర్తి సమాచారం ఇంకా వెల్లడికాలేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!