
బిజినెస్

తెలంగాణ బోనాల పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్థించినట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలు పాడిపంటలతో సంతోషంగా, ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలందరికీ సుఖసంతోషాలు, శాంతి, అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు. భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న బోనాల వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!