
జనరల్

ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల యువ ఇంజనీర్కు వైద్య బృందం ఏకబిగిన 36 గంటలపాటు శ్రమించి ఒకేసారి ఐదు ప్రధాన శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించింది.
ఈ శస్త్రచికిత్సలో జీర్ణాశయం, డ్యూడెనమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, పెద్దపేగు అవయవాలను ఒకేసారి మార్పిడి చేసి దేశంలోనే అరుదైన వైద్య ఘనతను సాధించారు. జాతీయ వైద్యుల దినోత్సవం రోజున ఈ విజయాన్ని నమోదు చేసి వైద్య వృత్తికి మరింత గౌరవాన్ని తీసుకువచ్చారని సీఎం కొనియాడారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!