

క్రీడా రంగంలో భారత్ మరింత బలమైన దేశంగా ఎదగాలంటే అంతర్జాతీయ పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన నిలవడమే లక్ష్యంగా ఉండాలని మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ అన్నారు. భారత్ ఇప్పటికే పలు అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో, పతకాల పట్టికలో దేశ స్థానం మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. క్రీడా మౌలిక వసతులు, అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని మెరుగైన ప్రదర్శనలు, పతకాలుగా మలచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో సైనా నెహ్వాల్ మాట్లాడుతూ భారత క్రీడా రంగంలో ముఖ్యంగా మహిళల భాగస్వామ్యంలో గత దశాబ్ద కాలంలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. మహిళా అథ్లెట్లు తమ శక్తిసామర్థ్యాలను గుర్తించి, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేందుకు మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు వస్తున్నారని తెలిపారు. మహిళా క్రీడాకారిణుల సంఖ్య పెరగడంతో పాటు వివిధ క్రీడల్లో వారు సాధిస్తున్న విజయాలు దేశ క్రీడా రంగానికి కొత్త ఊపునిస్తున్నాయని సైనా పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!