

కాక్రోచ్ జనతా పార్టీ తన తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే నివాసంలో మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో ఆగస్టు 5న కోర్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి ముందు స్వచ్ఛంద కార్యకర్తలు, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించాలని పార్టీ సభ్యులు నిర్ణయించారు. ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం, విద్యార్థులపై నమోదైన కేసుల ఉపసంహరణ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం వంటి అంశాలపై చర్చించనున్నారు. సమావేశం అనంతరం పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.
నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ వివాదం నేపథ్యంలో జాతీయ పరీక్షల సంస్థ పరీక్షల భద్రతను మరింత పటిష్టం చేస్తోంది. సంస్థ ప్రధాన కార్యాలయం, ప్రాంతీయ కార్యాలయాలు, సర్వర్ గదులు, భద్రపరిచే గదులు, ప్రశ్నపత్రాల నిల్వ కేంద్రాలకు 24 గంటల భద్రత కల్పించేందుకు సుమారు రూ.7.5 కోట్ల విలువైన టెండర్లను ఆహ్వానించింది. రెండేళ్ల కాలానికి ఈ ఒప్పందం అమలుకానుండగా, ఆగస్టు 17 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. భద్రతతో పాటు శుభ్రత నిర్వహణ, అత్యంత సురక్షితమైన ప్రశ్నపత్రాల ముద్రణ సేవలకు కూడా టెండర్లు కోరింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!