
జనరల్

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చైర్మన్ వి. సురేంద్రబాబు మణినాయుడు, ఆలయ అర్చకులు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని చిన్నమండెం మండలం బొరెడ్డిగారిపల్లెలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు మంత్రిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
స్వామివారి ఆశీస్సులతో బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను ఆలయ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఆహ్వానాన్ని స్వీకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి స్వామివారి ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!