

చైనాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న భారతీయ ప్రవాసులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. భారత్కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం, భారత నిపుణులకు వర్క్ వీసాల జారీలో ఇబ్బందులు, జీవిత భాగస్వాముల ఉపాధిపై ఆంక్షలు వంటి అంశాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. చైనాలోని భారత రాయబార కార్యాలయం నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ప్రవాసులు తమ సమస్యలను రాయబారి విక్రమ్ దొరైస్వామి దృష్టికి తీసుకెళ్లారు.
భారతీయుల ఆహార అలవాట్లు, సంస్కృతిని లక్ష్యంగా చేసుకున్న ప్రతికూల ఆన్లైన్ కంటెంట్ పెరుగుతోందని ప్రవాసులు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన రాయబారి విక్రమ్ దొరైస్వామి, తప్పుడు ప్రచారాలను ఎదుర్కొనేందుకు వాస్తవ ఆధారిత సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నామని తెలిపారు. భారత సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేసే సాంస్కృతిక కార్యక్రమాలను మరింతగా నిర్వహిస్తామని వెల్లడించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!