

దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఎన్డీయే కూటమి 45 శాతం ఓట్లతో 326 స్థానాలను గెలుచుకుంటుందని ఇండియా టుడే-సీ ఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే అంచనా వేసింది. ఇందులో బీజేపీకు 261, మిత్రపక్షాలకు 65 సీట్లు దక్కే అవకాశం ఉందని తెలిపింది. జనవరి సర్వేతో పోలిస్తే ఎన్డీయే అంచనా సీట్ల సంఖ్య 352 నుంచి 326కు తగ్గింది. మరోవైపు, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 185 సీట్లు గెలుచుకుంటుందని సర్వే పేర్కొంది. జనవరితో పోలిస్తే ఇది మూడు సీట్లు పెరిగినప్పటికీ, 2024 లోక్సభ ఎన్నికల్లో కూటమి సాధించిన 234 స్థానాలతో పోలిస్తే 49 సీట్లు తక్కువ.
జులై 1 నుంచి ఆగస్టు 25 వరకు దేశవ్యాప్తంగా 25,184 మందిని నేరుగా సర్వే చేసినట్లు సీ ఓటర్ తెలిపింది. గత ఆరు నెలల్లో మరో 91,795 మంది అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది. జెన్ జీ ఉద్యమాలు, పేపర్ లీక్లు, పరీక్షల నిర్వహణపై వచ్చిన విమర్శలు బీజేపీ ప్రతిష్ఠపై ప్రభావం చూపినట్లు సర్వే విశ్లేషించింది. ఇదే సమయంలో రాహుల్ గాంధీ చేపట్టిన ప్రజా ఉద్యమాల కారణంగా కాంగ్రెస్ అంచనా సీట్ల సంఖ్య 80 నుంచి 106కు పెరిగినట్లు తెలిపింది. ప్రధానమంత్రి అభ్యర్థిగా 49 శాతం మంది నరేంద్ర మోదీని, 27 శాతం మంది రాహుల్ గాంధీని ఇష్టపడగా, జోసెఫ్ విజయ్ 9 శాతంతో మూడో స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!