
జనరల్

ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్కు ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో శనివారం వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. మరో అల్పపీడనం సెప్టెంబర్ 3 లేదా 4 తేదీల్లో ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు, గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదయ్యాయి. తిరుపతి, ఒంగోలులో 38.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!